వైకాపా అధికారంలోకి వచ్చాకే సామాజిక న్యాయం:రెండో బస్సు యాత్రలోమంత్రులు
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపానే గెలిపించాలని ఏపీ మంత్రులు కోరారు. విశాఖపట్నం నగరంలోని పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాజువాకలో నిర్వహించిన సభలో
- By khaja --
- Friday, 27 May, 2022
గాజువాక: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపానే గెలిపించాలని ఏపీ మంత్రులు కోరారు. విశాఖపట్నం నగరంలోని పాత గాజువాక జంక్షన్ నుంచి రెండో రోజు బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గాజువాకలో నిర్వహించిన సభలో మంత్రులు, వైకాపా నేతలు మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చాకే సామాజిక న్యాయం అమలవుతోందని చెప్పారు.రాష్ట్రంలో అన్ని వర్గాలు, కులాలకు ఏ ప్రభుత్వం అందించనంత అవకాశాలను సీఎం జగన్ అదించారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఏపీలో జరిగినంత రాజకీయ సాధికారత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగలేదని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గతంలో ఆదరించినట్లే రాబోయే ఎన్నికల్లోనూ జగన్ను ఆశీర్వదించాలని కోరారు
khaja